Sri Venkateswara Institute of Medical Sciences-SVIMS

Sri Venkateswara Institute of Medical Sciences-SVIMS SVIMS is a Medical Institute and a Multi Speciality Hospital in Tirupati, Andhra Pradesh, India.

స్విమ్స్‌, తిరుప‌తి ,తేదిః 19.05.2026, స్విమ్స్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో   సాయినగర్ పంచాయితీ, తిరుపతి రూరల్ నందు ‘రక్తదాన...
19/05/2026

స్విమ్స్‌, తిరుప‌తి ,
తేదిః 19.05.2026,

స్విమ్స్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో సాయినగర్ పంచాయితీ, తిరుపతి రూరల్ నందు ‘రక్తదాన శిబిరం ’

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) బ్లడ్ సెంటర్ విభాగం ఆధ్యర్యంలో పీపుల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా నేషనల్ భరత్ సేవక్ సమాజ్, సాయినగర్, తిరుపతి రూరల్ నందు 19.05.2026వ తేది మంగళవారం ఉదయం 10గం॥ లకు స్వచ్ఛంద రక్తదాన శిబిరంను నిర్వహించినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్‌గారు తెలియజేశారు.

సాయినగర్ మాజీ సర్పంచ్ శ్రీ డి.వి. రమణ గారి అభ్యర్థన మేరకు నిర్వహించిన శిబిరం ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..* . రక్తదాన శిబిరం నిర్వహించుటకు అంగీకరించిన స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి.కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రక్తదాన శిబిరంనకు అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది ఈ శిబిరానికి స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేసినట్లు తెలిపారు.

స్విమ్ బ్లడ్ సెంటర్ విభాగాధిపతి డా॥ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ శిభిరంలో బ్లడ్ బ్యాంక్ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొని 30 మందికి బ్లడ్ గ్రూపింగ్ పరీక్షలు నిర్వహించగా అందులో 24 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమంలో స్విమ్స్ బ్లడ్ సెంటర్ డా॥ సురేష్‌బాబు, డా॥ ప్రశాంత్, డా॥ గాయత్రి, స్టాఫ్ నర్సులు శ్రీమతి రమాదేవి, శ్రీమతి చంద్రకళ, టెక్నిషియన్లు శ్రీమతి రెడ్డికుమారి, శ్రీమతి అనిత, ఎం.ఎస్.డబ్ల్యూ శ్రీమతి బి.శ్రీదేవి మరియు ఇంటర్నిస్ తదితరలు పాల్గొన్నారు.

-స్విమ్స్ సోషల్ మీడియా

తిరుపతి,తేది :18-05-2026స్విమ్స్ ఆధ్వర్యంలో ఇందిరా నగర్-1లో పింక్ బస్ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్శ్రీ వెంకటేశ్వర వైద్య వి...
18/05/2026

తిరుపతి,
తేది :18-05-2026

స్విమ్స్ ఆధ్వర్యంలో ఇందిరా నగర్-1లో పింక్ బస్ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్

శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో సోమవారం తిరుపతి ఇందిరానగర్-1 సచివాలయంలో పింక్ బస్ ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం జరిగింది. ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ముందస్తు నివారణ చర్యలపై చిత్రపటాల ద్వారా అవగాహన కల్పించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి. పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలు నిర్వహించారు.

స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటి మెడిసిన్ ప్రొఫెసర్ మరియు పింక్ బస్ ప్రాజెక్టు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ అంజు డి ఆదె మార్గదర్శకత్వంలో నోడల్ ఆఫీసర్లు డాక్టర్ భవాని, డాక్టర్ శివసంతోష్ పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరం జరిగింది.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బుల్లెట్ రమణ, విశ్వనాథం, రాజారామ్, ప్రకాశం రోడ్ అర్బన్ పిహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ క్రాంతి కుమార్, పింక్ బస్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పద్మావతి, డాక్టర్ హరిత, డాక్టర్ లావణ్య, ఏఎన్ఎంలు జయంతి, విజయలక్ష్మీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

-స్విమ్స్ సోషల్ మీడియా

తిరుపతి,తేది: 16-05-2026స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ చేతులమీదుగా 'క్లినికల్ అధ్యయనాలలో నమూనా పరిమాణ నిర్ధారణ ...
18/05/2026

తిరుపతి,
తేది: 16-05-2026

స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ చేతులమీదుగా 'క్లినికల్ అధ్యయనాలలో నమూనా పరిమాణ నిర్ధారణ - ఒక ఆచరణాత్మక మార్గదర్శి' పుస్తకావిష్కరణ

స్విమ్స్ మాజీ బయోస్టాటిస్టిషియన్ కె.వి.ఎస్. శర్మ రచించిన 'క్లినికల్ స్టడీస్‌లో నమూనా పరిమాణ నిర్ధారణ - ఒక ఆచరణాత్మక మార్గదర్శి' అనే పుస్తకాన్ని శనివారం స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్.వి. కుమార్ ఆవిష్కరించారు. న్యూఢిల్లీలోని నరోసా పబ్లిషింగ్ హౌస్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.

ఈ సందర్భంగా డాక్టర్ ఆర్వీ కుమార్ మాట్లాడుతూ ఏ క్లినికల్ అధ్యయనానికైనా సరైన సంఖ్యలో సబ్జెక్టులు/రోగులను ఎంచుకోవడం చాలా కీలకమన్నారు. ఈ సంఖ్యను నిర్ధారించడానికి గణాంక పద్ధతులు విలువైన సాధనాలను అందిస్తాయని, కానీ ప్రతి వైద్య పరిశోధకుడికి ఈ రంగంలో ప్రాథమిక పరిజ్ఞానం అవసరమని తెలిపారు. ఈ పుస్తకం పీజీ వైద్య విద్యార్థులకు, అధ్యాపకులకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన రచయితలు డాక్టర్ కె.వి.ఎస్.శర్మ, సహ రచయిత్రి డాక్టర్ వి. సాయి శారదలను అభినందించారు.

ఈ అంశంపై అనేక పుస్తకాలు క్లుప్తంగా ప్రస్తావించినప్పటికీ, ఒక భారతీయ రచయిత రాసిన ఇటువంటి పుస్తకాలలో ఇదే మొదటిదని స్విమ్స్ మాజీ డీన్, మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడి మోహన్ అన్నారు. ఈ పుస్తకం ద్వారా వైద్యులు, బయోస్టాటిస్టిషియన్లు ఇద్దరూ ప్రయోజనం పొందుతారని విశ్వసిస్తున్నట్లు ఎస్‌వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.వి. సత్యనారాయణ తెలిపారు.

అనంతరం, డాక్టర్ ఆర్వీ కుమార్ www.samplesizemaster.com అనే పేరుతో ఒక ఉచిత ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

-స్విమ్స్ సోషల్ మీడియా

స్విమ్స్‌, తిరుప‌తి, తేదిః 16.05.2026స్విమ్స్ లో ప్రపంచ రక్తపోటు దినోత్సవంశ్రీ వేంకట్వేర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) ...
18/05/2026

స్విమ్స్‌, తిరుప‌తి,
తేదిః 16.05.2026

స్విమ్స్ లో ప్రపంచ రక్తపోటు దినోత్సవం

శ్రీ వేంకట్వేర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) కార్డియాలజి విభాగం ఆధ్వర్యంలో "ప్రపంచ రక్తపోటు దినోత్సవం” (World Hypertension Day) ను స్విమ్స్ శ్రీ పద్మావతి ఓ.పి.డి. బ్లాక్ నందు 16.05.2026వ తేది శనివారం ఉ॥ 10 గం॥ లకు నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్ గారు తెలియజేశారు.

స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి. కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని (కలిసి కట్టుగా అధిక రక్తపోటును నియంత్రిస్తున్నాము) "Controlling Hypertension Together!" అనే థీమ్ తో ఈ సంవత్సరం మనం నిర్వహించడం జరిగింది.

కార్డియాలజి సీనియర్ ప్రొఫెనర్ మరియు విభాగాధిపతి డా॥ వనజాక్షమ్మ గారు మాట్లాడుతూ... అధిక రక్తపోటును కంట్రోల్ లో వుంచుకోవడానికి ప్రతి రోజు యోగా, ధ్యానం లాంటివి చేసుకుంటూ, మనసును ప్రశాంతంగా వుంచుకోవాలన్నారు. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే అధికరక్తపోటును నియంత్రించవచ్చునన్నారు. పండ్లు, కూరగాయలు, అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మీ రక్తపోటు తగ్గుతుందన్నారు.

కార్డియాలజి అసిస్టెంట్ ప్రొఫెనర్ డా॥ వరుణ్ గారు మాట్లాడుతూ... రక్తపోటుకు గల కారణాలు, లక్షణాలు, రక్తపోటు ఎలా గుర్తించాలి ? రక్తపోటు తగ్గించుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి వివరించారు.

కార్డియాలజి అసిస్టెంట్ ప్రొఫెనర్ డా॥ ఫర్దీబా గారు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసే తత్వం అలవాటు చేసుకోసువడం వల్ల శరీరంలో అధిక కొవ్వును అరికట్టవచ్చునని, ప్రాసెసింగ్ ఫుడ్ తీసుకోకపోవడం మంచిదని సూచించారు. దీనివలన అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం నుండి కాపాడకోవచ్చునని, అలాగే రక్తపోటు ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

కార్డియాలజి అసిస్టెంట్ ప్రొఫెసర్ డా॥ వాహిద్ ఖాన్ గారు మాట్లాడుతూ... బీపీని కంట్రోల్ వుంచుకోవడం వల్ల స్ట్రోక్, పక్షవాతం లాంటివి తగ్గించుకోవచ్చు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం 30 ని॥లు పాటు వ్యాయామం చేయడం, ఉప్పు తక్కువ తినడం వల్ల బీపిని కంట్రోల్లో వుంచుకోవచ్చునని తెలిపారు. అధిక బరువును నియంత్రించుకోకపోతే అధికరక్తపోటుకు గురికావాల్సి వస్తుందన్నారు.

కార్డియాలజి అసిస్టెంట్ ప్రొఫెనర్ డా|| అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ.. రక్తపోటు అందరికీ వుంటాది కానీ అది నార్మల్ గా వుందా లేదా అనేది క్రమంగా చెక్ చేసుకోంటు వుండాలన్నారు. ఇంటి వద్ద బి.పి. చూసుకొనే విధానాన్ని వివరించారు.

కార్డియాలజి వైద్యులు డా॥ నురేష్ కుమార్ గారు మాట్లాడుతూ... రక్తపోటు ఎక్కువగా వున్నప్పుడు గమనించవలసిన లక్షణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

అధిక రక్తపోటు పై పేషంట్లకు సాధారణంగా వుండే సందేహాలను నివృత్తి పై ప్యానెల్ చర్చలో మోడెరేటర్ గా కార్డియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా॥ వాహిద్ ఖాన్ గారు వ్యవహించారు. పేషంట్లు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు, చివరిగా వైద్యులు, పేషంట్లు కలిసికట్టుగా ప్రతి ఇంటిలో, ప్రతి గ్రామంలో రక్తపోటును నియంత్రింస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేయాలని సంకల్పం చేశారు.

అనంతరం పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో కార్డియాలజీ విభాగపు వైద్యులు డా॥ రోహిత్, డా॥ ఉపేంద్ర, డా॥ధర్మసాయి, డా॥ విష్ణు ప్రసన్న బాబు, డా॥ విష్ణు వర్థన్, డా॥ నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

-స్విమ్స్ సోషల్ మీడియా

స్విమ్స్, తిరుపతితేది : 14-05-2026స్విమ్స్ ఆధ్వర్యంలో ఇందిరా నగర్-2లో పింక్ బస్ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్శ్రీ వెంకటేశ్వ...
14/05/2026

స్విమ్స్, తిరుపతి
తేది : 14-05-2026

స్విమ్స్ ఆధ్వర్యంలో ఇందిరా నగర్-2లో పింక్ బస్ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్

శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో గురువారం తిరుపతి ఇందిరానగర్-2 సచివాలయంలో పింక్ బస్ ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం జరిగింది. ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ముందస్తు నివారణ చర్యలపై చిత్రపటాల ద్వారా అవగాహన కల్పించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి. పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలు నిర్వహించారు.

స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటి మెడిసిన్ ప్రొఫెసర్ మరియు పింక్ బస్ ప్రాజెక్టు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ అంజు డి ఆదె మార్గదర్శకత్వంలో నోడల్ ఆఫీసర్లు డాక్టర్ భవాని, డాక్టర్ శివసంతోష్ పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరం జరిగింది.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బుల్లెట్ రమణ, విశ్వనాథం, రాజారామ్, ప్రకాశం రోడ్ అర్బన్ పిహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ క్రాంతి కుమార్, పింక్ బస్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పద్మావతి, డాక్టర్ హరిత, డాక్టర్ లావణ్య, ఏఎన్ఎంలు విజయలక్ష్మీ, జయంతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

-స్విమ్స్ సోషల్ మీడియా

స్విమ్స్, తిరుపతితేది : 13.05.2026స్విమ్స్ హాస్పిటల్ కి రూ.15,000/- (రూ.పదిహేను వేల రూపాయల) విలువ చేసే 2 వీల్ ఛైర్స్ విర...
13/05/2026

స్విమ్స్, తిరుపతి
తేది : 13.05.2026

స్విమ్స్ హాస్పిటల్ కి రూ.15,000/- (రూ.పదిహేను వేల రూపాయల) విలువ చేసే 2 వీల్ ఛైర్స్ విరాళం

శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) ఆసుపత్రికి 13.05.2026వ తేదీ బుధవారం ఉదయం 10.00గం||లకు చిలమనూరు గ్రామం, బాలయ్యపల్లి మండలం, తిరుపతి జిల్లాకు చెందిన బత్తల సుబ్రమణ్యం గారు 2 వీల్ ఛైర్స్ ను స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం నందు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి. కుమార్ గారికి అందజేశారని మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్ గారు తెలియజేశారు.

అనంతరం విరాళం అందించిన బత్తల సుబ్రమణ్యం గారు మాట్లాడుతూ... మా తల్లి గారు అయిన కీ|| శే|| బత్తల సుశీలమ్మ గారి జ్ఞాపకారం స్విమ్స్ హాస్పిటల్ కు పేషెంట్ల సహాయార్ధం కొరకు రూ.15,000/- (రూ.పదిహేను వేల రూపాయల) విలువగల 2 వీల్ ఛైర్స్ ను విరాళంగా ఇచ్చానని తెలియజేశారు.

స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి. కుమార్ గారు మాట్లాడుతూ....కీ॥ శే॥ బత్తల సుశీలమ్మ గారి భర్త అయిన శ్రీ జానకిరామయ్య మరియు కుమారుడు బత్తల సుబ్రమణ్యం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీల్ ఛైర్స్ పేషెంట్ల సౌకర్యార్ధం వినియోగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ (purchase) దిలీప్ కుమార్ గారు పాల్గొన్నారు.

-స్విమ్స్ సోషల్ మీడియా

స్విమ్స్, తిరుపతితేది: 12.05.2026 స్విమ్స్ లో ఘనంగా "అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం"రోగుల సేవలో నర్సుల పాత్ర వెలకట్టలేనిద...
13/05/2026

స్విమ్స్, తిరుపతి
తేది: 12.05.2026

స్విమ్స్ లో ఘనంగా "అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం"

రోగుల సేవలో నర్సుల పాత్ర వెలకట్టలేనిది

తిరుపతి శాసన సభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) ఆసుపత్రిలో 12.05.2026 వ తేది మంగళవారం మధ్యాహ్నం 3.00 గంటలకు శ్రీ పద్మావతి ఆడిటోరియం నందు 116వ అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవాన్ని (International Nurses Day) విజయవంతంగా నిర్వహించారని మెడికల్ సూపరింటిండెంట్ డా.రామ్ గారు తెలియజేశారు.

స్విమ్స్ డీన్ డా|| అలోక్ సచన్, తిరుపతి శాసన సభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు, తుడా చైర్మన్ శ్రీ డాలర్ దివాకర్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డా. రామ్, ఫార్మకాలజీ విభాగాధిపతి డా.ఉమామహేశ్వరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.శివశంకర్, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధారాణి, నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి సునీత, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1- ఇందిరమ్మ, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-2 శారదా దేవి, భువనేశ్వరి, నిర్మల గార్లు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

స్విమ్స్ డీన్ డా|| అలోక్ సచన్ గారు మాట్లాడుతూ... స్విమ్స్ సంచాల‌కులు మ‌రియు ఉప‌కుల‌ప‌తి డాక్ట‌ర్ ఆర్‌.వి.కుమార్ గారి ఆదేశాల మేర‌కు ఈ కార్యక్ర‌మాన్ని నిర్వ‌హించిన‌ట్టు చెప్పారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వైద్య రంగంలో నర్సింగ్ వృత్తి మహోన్నతమైనదని, నర్సింగ్ వృత్తి దైవత్వంతో కూడుకున్నదని, ఫ్లోరెన్స్ నైటింగేల్ స్వచ్చంద సేవకురాలిగా సమాజానికి నర్సింగ్ సేవలందించి వృత్తికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టారని పేర్కొన్నారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి శాసన సభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు మాట్లాడుతూ.... ఫ్లోరెన్స్ నైటింగేల్ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందార‌ని, ఇప్పటికి ఆ మహనీయురాలిని గుర్తుచేసుకుంటున్నామంటే ఆమె అందించిన నర్సింగ్ సేవలు ఎంత గొప్పవైనవో అర్థమౌతుందన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని నర్సులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రోగులకు సేవలందించాలని సూచించారు. సిమ్స్ కు వచ్చే రోగుల పట్ల ఎంతో ఓర్పుతో సేవలందిస్తున్న నర్సింగ్ సిబ్బంది సేవలను కొనియాడారు.

గౌరవ అతిథి తుడా చైర్మన్ శ్రీ డాలర్ దివాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ... నర్సింగ్ సిబ్బంది లింగ వివక్షకు తావులేకుండా మహిళలతో పాటు, పురుషులకు నర్సింగ్ విద్యను స్విమ్స్ నర్సింగ్ కళాశాలలో భోధించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో స్విమ్స్ నర్సులు అందించిన సేవలను వెలకట్టలేమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణలో నర్సులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోగులకు వారందిస్తున్న సేవలను ప్రత్యేకంగా కొనియాడారు.

నర్సింగ్ సూపరింటెండెంట్ డా॥ సునీత గారు మాట్లాడుతూ... ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె జ్ఞాపకార్ధం మరియు రోగులకు ఆమె అందించిన అమూల్యమైన నర్సింగ్ సేవలకు గుర్తింపుగా అంతర్జాతీయ నర్సింగ్ కౌన్సిల్ వారు నర్సింగ్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. నర్సింగ్ వ్యవస్థకు ఫ్లోరెన్స్ నైటింగేల్ ని మార్గ‌ద‌ర్శ‌కురాలిగా పేర్కొంటూ, 2026వ సంవత్సరపు థీమ్ "మన నర్సులు మన భవిష్యత్తు' నర్సులకు సాధికారత కల్పించండి. ప్రాణాలను కాపాడండి (“Our Nurses. Our Future. Empowered Nurses Save Lives,”) తెలిపారు.

స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ గారు మాట్లాడుతూ... నర్సులకు సమాజంలో ఎంతో ఉన్నతమైన స్థానం ఉందన్నారు. రోగుల సేవను భగవంతుని సేవగా భావించి నర్సులు సేవలందించాలని కోరారు.

అనంతరం చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. శివశంకర్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ డా.సుధారాణి, ఫార్మకాలజీ విభాగాధిపతి డా. ఉమామహేశ్వరరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ లు తదితరులు ప్రసంగించారు.

స్విమ్స్ డీన్ డా|| అలోక్ సచన్ గారు వృత్తి నిర్వహణలో ప్రతిభ కనపరచిన నర్సులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్. యం. ఓ. డాక్ట‌ర్‌. సతీష్, స్విమ్స్ నర్సింగ్ అసోసియేషన్ సభ్యులు, నర్సింగ్ సూపరింటెండెంట్లు, నర్సింగ్ సిబ్బంది. ఇతర విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.

-స్విమ్స్ సోషల్ మీడియా

స్విమ్స్ తిరుపతి తేది.07.05.26రాష్ట్రంలోనే ఉత్తమ ఆసుపత్రిగా స్విమ్స్ అభివృద్ధిటిటిడి ఛైర్మన్ శ్రీ బిఆర్. నాయుడు గారురూ.1...
07/05/2026

స్విమ్స్ తిరుపతి
తేది.07.05.26

రాష్ట్రంలోనే ఉత్తమ ఆసుపత్రిగా స్విమ్స్ అభివృద్ధి

టిటిడి ఛైర్మన్ శ్రీ బిఆర్. నాయుడు గారు

రూ.100 కోట్లతో స్విమ్స్ నందు ఆధునీకరణ మరియు వైద్యయంత్రాలు ప్రారంభం

రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ.శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యములో భాగంగా రాష్ట్రంలోనే ఉత్తమ ఆసుపత్రిగా శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) ను అభివృద్ధి చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బిఆర్ నాయుడుగారు వెల్లడించారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో రూ.55 కోట్లతో ఏర్పాటుచేసిన పెట్ సిటీ స్కాన్, గామా కెమెరా, హై ఎనర్జీ అడ్వాన్స్ లీనియర్ యాక్సిలరేటర్ ఆధునిక వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీ బిఆర్. నాయుడుగారు మీడియాతో మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. క్యాన్సర్ వైద్య చికిత్సల కోసం శ్రీ బాలాజి ఆరోగ్యవరప్రసాదిని పథకం నిధులతో ప్రారంభించిన. పెట్ సిటీ స్కాన్, గామా కెమెరా, హై ఎనర్జీ అడ్వాన్స్ డ్ లీనియర్ యాక్సిలరేటర్ వైద్య పరికరాలు రోగులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఇందులో దాదాపు రూ.18కోట్ల విలువైన పెట్ సిటీ స్కాన్ పరికరం క్యాన్సర్, మెదడు సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులను త్వరగా గుర్తించడంలో ఉపయోగపడుతుందన్నారు. రూ.5 కోట్ల విలువైన గామా కెమెరా అవయవాల పనితీరును, కణజాల స్థితిని చిత్రాల రూపంలో చూపిస్తుందని, క్యాన్సర్, ఇన్ఫెక్షన్లు, గుండె, మెదడు, థైరాయిడ్, ఎముకలు, మూత్రపిండాల పనితీరును అంచనా వేయడానికి ఉపయోగపడుతుందని వివరించారు. అదేవిధంగా, రూ.29 కోట్ల విలువైన హై ఎనర్జీ అడ్వాన్స్డ్ లీనియర్ యాక్సిలరేటర్ ద్వారా అధిక శక్తి గల ఎక్స్-రేలు లేదా ఎలక్ట్రాన్ కిరణాలను క్యాన్సర్ ట్యూమర్పై ఖచ్చితంగా ప్రసారం చేస్తుందని, దీని వల్ల చుట్టుపక్కల ఆరోగ్యకర కణజాలానికి హాని తక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ యంత్రం మెదడు, రొమ్ము, ప్రోస్టేట్, ఊపిరితిత్తులు వంటి భాగాల్లో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడుతుందన్నారు.

స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి శ్రీ . నందమూరి తారక రామారావు రామారావు గారు స్థాపించిన స్విమ్స్ విశ్వవిద్యాలయం అంచలంచెలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. 30 ఏళ్లుగా టిటిడి సహకారంతో రూ.450 కోట్లతో ఆసుపత్రిలో మెరుగైన వైద్యసౌకర్యాలు ఏర్పాటుజరిగిందని వివరించారు. ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్. నాయుడు గారి మార్గదర్శకత్వంలో ఇదివరకెన్నడూ లేనివిధంగా రూ.600 కోట్లతో పలు భవనాలు నిర్మించుకుంటున్నామని వెల్లడిచారు. ఆరు నెలల క్రితం దాతల సహకారంతో ఎంఆర్ ఐ, సిటి స్టిమ్యులేటర్ యంత్రాలు ప్రారంభించామని గుర్తు చేశారు. మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో క్యాన్సర్ బ్లాకు ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో భవిష్యత్తులో రోబోటిక్ సర్జరీలు, వైద్య విద్యార్థులకు ఉపయోగపడేలా సిమ్యులేటర్స్, వర్చువల్ డిసెక్షన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.105 కోట్ల విరాళాలతో స్విమ్స్ పలు వైద్యపరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. శ్రీ బాలాజి ఆరోగ్యవరప్రసాదిని పథకానికి విరివిగా విరాళాలు అందించి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు తోడ్పాటునందిస్తున్న దాతలకు, కార్పొరేట్ సామాజిక బాధ్యతగా నిధులు అందిస్తున్న సంస్థలకు స్విమ్స్ కుటుంబం తరఫున పాదాభివందనాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ సదాశివరావు, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీమతి జానకి దేవి. శ్రీ భానుప్రకాష్ రెడ్డి, తుడ ఛైర్మన్ మరియు టిటిడి బోర్డు సభ్యులు శ్రీ సి. దివాకర్రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు, తిరుపతి మున్సిపల్ మాజీ డిప్యూటీ మేయర్ ఆర్. సి. మునికృష్ణ, ఇతర నాయకులు స్విమ్స్ అధికారులు మరియు రేడియేషన్ అంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ విభాగం వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

-స్విమ్స్ సోషల్ మీడియా

స్విమ్స్, తిరుపతి తేది - 06.05.2026 స్విమ్స్ - శ్రీ వారి వైద్య సేవలో భాగంగా సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం ఆధ్వర్య...
07/05/2026

స్విమ్స్, తిరుపతి
తేది - 06.05.2026

స్విమ్స్ - శ్రీ వారి వైద్య సేవలో భాగంగా సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం ఆధ్వర్యంలో
అతిథి ఉపన్యాసం

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి ఆడిటోరియం నందు 06.05.2026 మధ్యాహ్నం 2:00 గంటలకు అతిథి ఉపన్యాసం నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్ గారు తెలియజేశారు.

స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి.కుమార్ గారు మాట్లాడుతూ.... సికింద్రాబాద్ కు చెందిన ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు డా॥ ఆర్.ఏ. శాస్త్రి గారు శ్రీవారి వైద్య సేవలో భాగంగా స్విమ్స్ కు వచ్చి మూడు రోజుల పాటు ఎం.బి.బి.యస్.పి.జి. రెసిడెంట్లకు ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించడం సంతోషదాయకమని తెలిపారు. వైద్య విద్యార్థులు శాస్త్రీ గారు చెప్పినటువంటి సలహాలు సూచనలు తీసుకుని వైద్య విద్యలో ముందుకెళ్లాలని తెలిపారు. టి.టి.డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవారి వైద్య సేవకు వైద్యులు విచ్చేసి పేద పేషంట్లకు వైద్య సేవలు అందించాలని కోరారు.

ముఖ్య అతిధిగా విచ్చేసిన క్రిష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి మరియు అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ డా॥ ఆర్.ఏ. శాస్త్రి గారు మాట్లాడుతూ.... సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం వైద్య విద్యార్థులకు లాప్రోస్కోపీ, రోబోటిక్ ద్వారా శస్త్రచికిత్సలో నైపుణ్యం సాధించడం, క్లినికల్ డేటాబేస్, శస్త్రచికిత్స ఆడిట్, కేస్ క్యాప్సిల్స్ ఉదర సంబంధిత సెప్సిస్ వంటి విషయాలు గుంచి వైద్య విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మూడు రోజుల పాటు అవగాహన కల్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ మరియు జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ముత్తీశ్వరయ్య, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డా॥ శివరామక్రిష్ణ డా|| వెంకటరామిరెడ్డి, డా|| చంద్రమాలీటీశ్వరన్, డా|| మనోజ్ కృష్ణ,
డా॥ శ్రీహరి, విభాగపు వైద్యులు, పి.జి. రెసిడెంట్లు, ఎం.బి.బి.ఎస్. విద్యార్థిని, విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

-స్విమ్స్ సోషల్ మీడియా

స్విమ్స్, తిరుపతి తేది: 05.05.2026చేతుల శుభ్ర‌త‌పై ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు బ్రాండ్ అంబాసిడ‌ర్లు కావాలి- స్విమ్స్ సంచాల‌కుల...
05/05/2026

స్విమ్స్, తిరుపతి
తేది: 05.05.2026

చేతుల శుభ్ర‌త‌పై ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు బ్రాండ్ అంబాసిడ‌ర్లు కావాలి

- స్విమ్స్ సంచాల‌కులు మ‌రియు ఉప‌కుల‌ప‌తి డాక్ట‌ర్ ఆర్వీ కుమార్ గారు

- ఘ‌నంగా ప్రపంచ చేతుల‌ పరిశుభ్రత దినోత్సవం

చేతులు ప‌రిశుభ్రంగా ఉంచుకుంటే చాలా వ్యాధులు ద‌రి చేర‌వ‌ని, ఈ అంశానికి ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారి ప్ర‌జ‌లంద‌రికీ విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని శ్రీ వేంకటేశ్వ‌ర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) సంచాల‌కులు మ‌రియు ఉప‌కుల‌ప‌తి డాక్ట‌ర్ ఆర్వీ కుమార్ గారు పిలుపునిచ్చారు. స్విమ్స్ కమ్యూనిటి మెడిసిన్, మైక్రోబయాలజి విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో 05.05.2026వ తేది మంగళవారం మధ్యాహ్నం 12 గం॥ లకు శ్రీ పద్మావతి ఆడిటోరియంలో ప్రపంచ చేతుల‌ పరిశుభ్రత దినోత్సవం నిర్వహించినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్ గారు తెలియజేశారు.

ఈ కార్యక్రమాన్ని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ గారు, మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ వెంకటరమణ, క‌మ్యూనిటి మెడిసిన్ ఇన్‌చార్జి విభాగాధిప‌తి డాక్టర్ అంజు డి అదే, మైక్రోబ‌యాల‌జి ప్రొఫెస‌ర్ మ‌రియు ఇన్‌ఫెక్ష‌న్ ప్రివెన్ష‌న్ అండ్ కంట్రోల్ లీడ్‌ డాక్టర్ ఆర్‌.జయప్రద గార్లు సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ గారు మాట్లాడుతూ 18వ శ‌తాబ్దంలో చేతులు శుభ్రం చేసుకోకుండా సాధార‌ణ కాన్పులు చేయ‌డంతో ఇన్‌ఫెక్ష‌న్ల కార‌ణంగా చాలావ‌ర‌కు ప్ర‌సూతి మ‌ర‌ణాలు సంభ‌వించేవ‌న్నారు. ఆ త‌రువాత క్ర‌మ‌క్ర‌మంగా చేతుల ప‌రిశుభ్ర‌త‌పై అవగాహ‌న పెరుగుతూ వ‌చ్చింద‌ని, కోవిడ్ అనంత‌రం చాలామంది ఈ అంశానికి ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని వివ‌రించారు. స్విమ్స్‌లో ఇన్‌ఫెక్ష‌న్ ప్రివెన్ష‌న్ అండ్ కంట్రోల్ ప్రోటోకాల్‌ను ప‌క‌డ్బందీగా పాటిస్తున్న‌ట్టు తెలియ‌జేశారు.

మైక్రోబ‌యాల‌జి ప్రొఫెస‌ర్ మ‌రియు ఇన్‌ఫెక్ష‌న్ ప్రివెన్ష‌న్ అండ్ కంట్రోల్ లీడ్‌ డాక్టర్ ఆర్‌.జయప్రద గారు మాట్లాడుతూ ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు ఆరు ద‌శ‌ల్లో పాటించాల్సిన ప‌ద్ధ‌తుల‌ను తెలిపారు. వైద్యులు పేషెంట్స్ వ‌ద్ద‌కు వెళ్లే ముందు ఒకసారి, చికిత్స చేసిన త‌రువాత మ‌రోసారి తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్య‌క్ర‌మానికి నోడల్ ఫ్యాకల్టీగా వ్యవహరించిన కమ్యూనిటి మెడిసిన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా॥ వై.భవాని గారు స్వాగ‌తోప‌న్యాసం చేశారు. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం 2009వ సంవ‌త్స‌రం నుండి ప్రారంభ‌మైంద‌న్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే చేతులను శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేయాల‌ని సూచించారు. ఆహారం తినే ముందు మరియు వడ్డించే ముందు చేతులు కడుక్కోవాలన్నారు.

డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. నోబుల్ ఉజేష్ గారు చేతుల‌ పరిశుభ్రత ప్రాముఖ్యతను వివ‌రించారు. అంటు వ్యాధులలో 80 శాతం వరకు చేతుల ద్వారానే వ్యాపిస్తాయ‌ని, సబ్బుతో చేతులు కడుక్కోవడం వ‌ల్ల ఫ్లూ, డయేరియా, కోవిడ్-19 వంటి తీవ్రమైన వ్యాధులు రాకుండా జాగ్ర‌త్త‌ప‌డ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఈ అల‌వాటు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని 16 శాతం తగ్గిస్తుంద‌ని, ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రాణాలను కాపాడుతోంద‌ని పేర్కొన్నారు.

డిపార్ట్ మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ సిబ్బంది శ్రీమతి ఎం. లక్ష్మీ దేవి, శ్రీమతి ఎ.శోభా రాణి చేతుల పరిశుభ్రతకు సంబంధించి వీడియో మరియు ఫొటోల ప్రదర్శన నిర్వహించారు. అనంత‌రం ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌ను ప‌లు గ్రూపులుగా విభ‌జించి చేతుల ప‌రిశుభ్ర‌త విధానాల‌పై వ‌ర్క్‌షాప్ చేప‌ట్టారు.

-స్విమ్స్ సోషల్ మీడియా

స్విమ్స్, తిరుపతి తేది : 05.05.2026స్విమ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆస్తమా దినోత్సవంశ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ...
05/05/2026

స్విమ్స్, తిరుపతి
తేది : 05.05.2026

స్విమ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆస్తమా దినోత్సవం

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) రెస్పిరేటరీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో 05.05.2026 వ తేది మంగళవారం ఉదయం 10.00 గం|| లకు స్విమ్స్ శ్రీ పద్మావతి హాస్పిటల్ మొదటి అంతస్తు నందు "ప్రపంచ ఆస్తమా దినోత్సవం" నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్ గారు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా|| ఆర్.వి. కుమార్ గారు, రెస్పిరేటరీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా॥ అనూష, సీనియర్ రెసిడెంట్ డా॥ సాయి సంహిత క్రిష్ణ, జూనియర్ రెసిడెంట్ డా|| సాయిశ్రీ హర్ష గార్లు సంయుక్తంగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి.కుమార్ గారు మాట్లాడుతూ... గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా (GINA) ఎంచుకున్న 2026 ప్రపంచ ఆస్తమా దినోత్సవ థీమ్ "ఆస్తమా ఉన్న ప్రతి ఒక్కరికీ యాంటీ-ఇన్ఫ్లమేటరీ ఇన్లర్ల లభ్యత- ఇప్పటికీ అత్యవసరం": ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక సాధారణ వ్యాధి, అస్తమా లక్షణాల వలన శ్వాస తీసుకోవడం కష్టమవుతుందని, ఆస్తమా ఉన్న రోగులందరికీ సరైన మందులు, ముఖ్యంగా పీల్చే కార్టికోస్టెరాయిడ్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాల్సిన అత్యంత ఆవశ్యకతను నొక్కి చెబుతుందన్నారు.

రెస్పిరేటరీ మెడిసిన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా॥ అనూష గారు మాట్లాడుతూ... ఆస్తమా ఉన్న పిల్లలు మరియు పెద్దలలో శ్వాసకోస సమస్యలపై అప్రమత్తత పెంచడం, సకాలంలో నిర్ధారణ మరియు చికిత్స అవసరం అని, ముఖ్యంగా ధూళి, పొగ, ఆయాసం, పెంపుడు జంతువుల వలన మరియు చల్లని గాలి వంటివి ఆస్తమాకు కారణమవుతాయని, ఆస్తమా లక్షణాలు ఉన్నవారు సకాలంలో వైద్యులను సంప్రదించి చికిత్స చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రెస్పిరేటరీ మెడిసిన్ విభాగపు వైద్యులు యు.జి, పి.జి వైద్య విద్యార్థులు, సిబ్బంది, పేషెంట్లు పాల్గొన్నారు.

-స్విమ్స్ సోషల్ మీడియా

Address

Alipiri Road
Tirupati
517507

Alerts

Be the first to know and let us send you an email when Sri Venkateswara Institute of Medical Sciences-SVIMS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sri Venkateswara Institute of Medical Sciences-SVIMS:

Share