29/03/2021
లయన్స్ క్లబ్ అఫ్ మచిలీపట్టణం మరియు డా. మధు సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ది.28-03-2021, ఆదివారం ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించబదినది. ఈ శిబిరంలో డా. వి. వి. ఎస్. డి. ఎస్. ఆర్. సాగర్ గారు, శ్వాస కోశ నిపుణులు , డా ఎం కిరణ్ కుమార్ గారు కాన్సర్ వైద్య నిపుణులు మరియు డా ఎం అశోక చక్రవర్తి గారు వారి సేవలు అందించారు .
ఈ శిభిరంలో రెండు వందల మంది పుర ప్రజలు డాక్టర్ల సేవలు వినియోగించుకున్నారని లయన్స్ ప్రతినిధులు తెలిపారు. ఎంతో శ్రమ కూర్చి నిర్వహిస్తున్న ఇటువంటి మెడికల్ క్యాంపులను ప్రజలు మరింతగా ఆదరించే అవసరం ఉందన్నారు. లయన్స్ సీనియర్ నాయకులు లయన్ జి రామబ్రహ్మం, లయన్ పి. సత్యనారాయణ, లయన్ ఉమా మహాశ్వర రావు, అధ్యక్షులు లయన్ దేవేంద్ర కుమార్, రీజియన్ చైర్మన్ పి. ప్రభాకర్, లయన్ హేమ శంకర్ లు మొదలగు వారు ఈ శిభిరం వినియోగించుకోవటానికి వచ్చిన అందరికి పులిహోర మరియు మజ్జిగ అందచేశారు. డా మధు హాస్పిటల్ యాజమాన్యం ఎం ఎం కే న్ ఆర్ గారు సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ సేవలు మరింత అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు.